విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించనున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12 నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ను చెన్నై లో ప్లాన్ చేశారట. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న ఈచిత్రంలో వెంకీ సరసన హ్యూమా ఖురేషి అలాగే చైతు కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు . పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక వెంకీ ప్రస్తుతం ‘ఎఫ్ 2’ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.ఇక నాగ చైతన్య ప్రస్తుతం ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తన 17వ చిత్రంలో నటిస్తున్నాడు.